What did not come in Makein India.. Prepare for discussion anywhere in the country: CM KCR
మేకిన్ ఇండియాలో ఏం రాలేదు.. దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్
జగిత్యాల : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతె వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్తిపోతున్నారు.
మేకిన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందనట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వారు..
విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి, మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. దెబ్బ తింటాం. ఒక్కసారి ఇబ్బంది వస్తే చాలా ఘోరంగా వంద సంవత్సరాలు వెనక్కి పోతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా.
మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అని కేసీఆర్ అన్నారు.
Spread the love 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన పనులపై…
Spread the love 125 – గాజుల రామారం డివిజన్ యండమూరి ఎన్క్లేవ్ నందు డివిజన్ అధ్యక్షులు విజయ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై…
Spread the love ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్…
Spread the love భువనగిరి పార్లేమెంట్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం MLC&NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు చిలువేరు అభి గౌడ్, మంగ ప్రవీణ్,కందుకూరి అంబేద్కర్, విష్ణు ఆధ్వర్యంలో భువనగిరిలో…
Spread the love మల్దకల్:-ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శేష వస్త్రంతో…
Spread the love రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు…
Spread the love ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన…
Spread the love మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 – సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులైన ఈటల, పట్నం…
Spread the love 125 – గాజులరామారం డివిజన్ ఇంద్రానగర్ ఏ & బి లలో డివిజన్ అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ను గెలిపించుకోవడం…
Spread the love మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి…