What did not come in Makein India.. Prepare for discussion anywhere in the country: CM KCR
మేకిన్ ఇండియాలో ఏం రాలేదు.. దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్
జగిత్యాల : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతె వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్తిపోతున్నారు.
మేకిన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందనట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వారు..
విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి, మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. దెబ్బ తింటాం. ఒక్కసారి ఇబ్బంది వస్తే చాలా ఘోరంగా వంద సంవత్సరాలు వెనక్కి పోతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా.
మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అని కేసీఆర్ అన్నారు.
Spread the love ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.
Spread the love సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్…
Spread the love ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం, బిజెపి- దాని వాట్సప్ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు సాధిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదో పెద్ద…
Spread the love లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Spread the love బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు…
Spread the love హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.. ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది…
Spread the love వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం…
Spread the love మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక…. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్…