అదే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయం: ఎంపీ సంతోష్‌ కుమార్‌

Spread the love


That is the first success of Green India Challenge: MP Santosh Kumar

అదే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయం: ఎంపీ సంతోష్‌ కుమార్‌

ములుగు: వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు.

విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. ఆలోచనలను ఆచరణగా మార్చి లక్ష్య సాధన కోసం కృషిచేయడంలోనే నిజమైన విజయం ఉందన్న స్ఫూర్తిని బలంగా నమ్మడంతోనే ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలకు దగ్గర చేయగలిగామని వెల్లడించారు.

తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) ఆవరణలో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Related Posts

You cannot copy content of this page