SAKSHITHA NEWS

Minister Puvvada Ajay Kumar condoles the death of Kancharla Lakshmareddy

కంచర్ల లక్ష్మారెడ్డి మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) మరణం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. లక్ష్మారెడ్డి నిరాడంబర జీవితాన్ని గడిపారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు మంత్రి అజయ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ తన సహాయనిధి నుంచి రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారని పేర్కొన్నారు. 1980లోనే తెలంగాణ పత్రికను స్థాపించి అన్యాయాలపై ధ్వజమెత్తి తెలంగాణ కొరకు నిస్వార్థంగా పోరాడిన వ్యక్తి కంచర్ల లక్ష్మారెడ్డి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.


SAKSHITHA NEWS