పలు పరామర్శలు, పలు ఆశీర్వాదాలు

Spread the love
Many blessings, many blessings

పలు పరామర్శలు, పలు ఆశీర్వాదాలు….

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు…
మొదటిగా మధిర మున్సిపాలిటీ పరిథిలో మడుపల్లి గ్రామంలో వాయుపుత్ర వెంకటరెడ్డి కుమార్తె, కుమారుడి నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నరులను ఆశీర్వదించారు

….

అనంతరం బోనకల్ మండలం పెద్దబీరువల్లి గ్రామంలో పిట్టల విష్ణు కుమార్తె, కుమారుడి నూతన వస్త్రాలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు…

అనంతరం మధిర మండలం ఇల్లూరు గ్రామంలో బీటెక్ వెంకటేశ్వర్లు సతీమణి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…..

అనంతరం బోనకల్ మండలం జానకీపురం గ్రామంలో చిలకా హుస్సేన్ అకాల మరణం పొందగా వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ఆర్థిక సహాయం అందించారు…..

యువకుడి కుటుంబానికి పరామర్శ…..

ముదిగొండ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ వుసికల సుధారాణి రమేష్ కుమారుడు శ్రీకర్ ఇటీవలే రోడ్ ప్రమాదంలో మరణించగా తన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుండెను మరియు తన అవయవాలు దానం చేసి మరొకరికి ప్రాణ దాత అయిన శ్రీకర్ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం పట్ల గర్విస్తూ తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చి వారికి ధైర్యం కల్పించారు.

రాంబాబు వెంట టీఆరెఎస్ పార్టీ నాయకులు శీలం వీర వెంకట రెడ్డి, ఇల్లూరు సర్పంచ్ కోట రామారావు, ఎన్నారై సైదులు, చిన్నబీరువల్లి సర్పంచ్ పేరిబత్తిని శాంతయ్య, టీఆరెఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చిలకా నాగరాజు, గొడుగు కృష్ణ, ఉపాధ్యక్షుడు చిలకా శివ, కొరివి సురేష్, నూకల నాగేశ్వరరావు, ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షులు కోట వెంకట్, గుండ్ల రత్నబాబు, బాలకృష్ణ, భాస్కర్, ముత్తయ్య, నాగేశ్వరావు, చిలకా దాసు, హరీష్, వేల్పుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page