ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చంద్ర బాబు

Spread the love

శ్రీకాకుళం :

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు.

ఈ నెల 15వ తేదీన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో ప్రజా గళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో పాల్గొంటారు. అనంతరం టెక్కలి, పలాస నియోజక వర్గాల్లో జరిగే ప్రజా గళం సభలకు హాజరు కానున్నారు.

ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత నూతనోత్సాహం నెలకొంది.

Related Posts

You cannot copy content of this page