ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం

Spread the love

ప్రజలతోనే ఉన్నాం… ప్రజల మధ్య ఉన్నాం…. సంక్షేమం అందించాం… అభివృద్ధి చేశాం ‌… మరొక అవకాశం కల్పించండి… మరింత అభివృద్ధి చేసుకుందాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఓటు వేసే ముందు ఆలోచించండి…. నందిగామ రూపురేఖలు ఎవరు మార్చారో…. పట్టణంలో అభివృద్ధి ఎవరు చేశారో…. ఆలోచించి ఓటు వేయండి…. మంచి చేసిన వారికే మద్దతు ఇవ్వమని కోరుతున్నాం ….

నందిగామ పట్టణంలోని కాకాని నగర్ లో…. ప్రతి గడపకు తిరుగుతూ…. మరోసారి గెలిపించాలని కోరుతూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ….

కులం, మతం, రాజకీయ భేదాలు చూడకుండా…. జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాం….. జన్మభూమి కమిటీల మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే…. పథకాలు ఇవ్వలేదు….

వాలంటీర్ల ద్వారా… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తున్నాం…. వాలంటీర్ల వ్యవస్థ పై చంద్రబాబు నాయుడు కక్ష కట్టి… ఫిర్యాదులు చేయిస్తున్నాడు…. చంద్రబాబు చేసిన దుర్మార్గం వల్ల ఈ నెలలో పింఛన్లు తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు మండుటెండల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు….

పట్టణంలో కోట్ల రూపాయలు వెచ్చించి… మౌలిక వస్తువులు కల్పిస్తున్నాం…. కేంద్రీయ విద్యాలయం, 100 పడకల ఆసుపత్రిని… మంజూరు చేయించి… విద్య, వైద్యానికి నందిగామను కేంద్ర బిందువుగా చేశాం…. రెవెన్యూ డివిజన్, మున్సిపల్ అప్ గ్రేడేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లతో…. ప్రజలకు నూతన వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి …..

గత తెలుగుదేశం పాలనలోని ఐదేళ్లలో…. నందిగామలో దోపిడీ… అవినీతి తప్ప…. చేసింది ఏమీ లేదు…. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి… వారిని ఓడించి మాకు అవకాశం కల్పించారు…. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశాం…

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ….

Related Posts

You cannot copy content of this page