చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

Spread the love

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి: కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

శంకర్‌పల్లి: మార్చ్ 23: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. శనివారం శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చైర్మన్ ను కలిసిన వారిలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజు గౌడ్, నాయకులు నసిరుద్దీన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page