రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో

Spread the love

రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో

శంకర్‌పల్లి: మార్చి 22: (సాక్షిత న్యూస్): రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో అని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధి 8వ వార్డు ఫతేపూర్ వార్డు కల్లు దుకాణం సమీపాన రోడ్డు పక్కన డ్రైనేజీ కోసం గుంత తవ్వారు. గుంతను పూడ్చడం మరిచారు. శుక్రవారం ఓ ప్రయాణికుడు కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేద్దామని నిలిపాడు. పక్కనే డ్రైనేజీ గుంతను చూడక అదుపుతప్పి ప్రమాదం ఏమి జరగలేదు. ఇప్పటికైనా రోడ్డు భవనాల అధికారులు, మునిసిపల్ అధికారులు, స్థానిక నాయకులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page