సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ధరణి నగర్ మరియు ఆల్విన్ కాలనీ-జయశంకర్ కాలనీ లో ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రోడ్డు మీద నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియచేసారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కాలనీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, వి.రాజబాబు, సుధాకర్ రెడ్డి, పోశెట్టిగౌడ్, శ్రీధర్, సంతోష్ బిరాదర్, రెహమాన్, ఇస్మాయిల్, రాజు, యాదవ్, మల్లికార్జున్, మహేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాస్ గుప్త, రంగారావు, బిష్మ కుమార్, చారి, లక్ష్మీ, వనజ, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page