చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

Spread the love

చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం
మహారాష్ట్ర రాష్ట్రానికి
చెందిన చిత్ర కౌలాస్ మోహితి(35), నౌనాథ్ గణపత్ చౌహన్(70), మాధన్
బాలసాహెబ్ బయస్ (38), రాజేష్ సుభాష్ మోహితే
(15) నలుగురిని అక్రమ మార్గంలో గంజాయి తరలిస్తుండగా 16లక్షలు విలువ చేసే 64 కేజీల
గంజాయి ప్యాకెట్ లను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై
వీరబ్రహ్మం, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page