జిన్నారం పి హెచ్ సి భవన నిర్మాణానికి కోటి 56 లక్షల రూపాయల నిధుల మంజూరు

Spread the love

56 lakh crores of funds for the construction of Jinnaram PHC building

జిన్నారం పి హెచ్ సి భవన నిర్మాణానికి కోటి 56 లక్షల రూపాయల నిధుల మంజూరు

ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన జిన్నారం ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు

సాక్షిత జిన్నారం:

మండల కేంద్రమైన జిన్నారంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కోటి 56 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గురువారం పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ లు మాట్లాడుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సంపూర్ణ సహకారాలతో నిధులు మంజూరు కావడం జరిగిందని పేర్కొన్నారు. త్వరిత గతిన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ,వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్,ఏర్పుల లింగం,ఎరుకల చిరంజీవి, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,బ్రహ్మేందర్ గౌడ్,మంద రమేష్, తోట నర్సింగ్ రావు,మున్నీ నర్సింగ్ రావు,కంది నర్సింగ్ రావు,ప్రేమ్,బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page