95 వేల కుటుంబాలకు 4,770 కోట్లు

Spread the love

4,770 crores for 95 thousand families

95 వేల కుటుంబాలకు 4,770 కోట్లు

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చనిపోయిన రైతులకు రూ.5 లక్షలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కేసీఆర్‌ ఆలోచనతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ కారణాలతో చనిపోయిన 95,416 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4,770.80 కోట్ల సాయం అందిందని సోమవారం మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతు బీమా పథకం కింద 40 లక్షల మందికి రైతులకు బీమా చేయించామని వెల్లడించారు.

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో చనిపోయిన రైతు, బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి రూ.5 లక్షల చెక్కును అందించిన స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన పార్టీ కార్యకర్త గజ్జి మల్లికార్జున్‌ గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page