2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్

Spread the love

2023 కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు హెచ్ సి జి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైక్లింగ్ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద …


సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ (హెచ్ సీ జీ ) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించనున్న సైకిల్ పోటీల పోస్టర్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. కావున అందరూ సైకిల్ ద్వారా ఫిట్ గా ఉండాలన్నారు. అనంతరం హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ 2017 సంవత్సరం నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహాయ సహకారాలతో వరుసగా గత రెండేళ్లుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర 13 మందితో దిగ్విజయంగా పూర్తి చేశామని ఈసారి కూడా నవంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే మూడవసారి యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. తమ గ్రూపుకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

హెచ్ సి జి సైకిల్ రైడర్లు : రేఖ సోలంకి, వెన్నెల బానోత్, డాక్టర్ నాగరాజు, సంతోష్, సోమశేఖర్, ప్రదీప్ బీరం, భావేష్ థాయల్, మోహిత్ అగర్వాల్, ప్రవీణ్ గోయల్, సురేష్ బాబు వట్టికుట్టి, రాహుల్ కసన, కావిష్ నక్కన, రవీందర్ రెడ్డి

Whatsapp Image 2023 11 07 At 2.15.41 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page