తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేత.

Spread the love

2 lakhs will be given as immediate assistance

బాచుపల్లిలో అగ్నిప్రమాదంలో ఇండ్లు కాలిన నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత

తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 20వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీలో నిన్న సాయంత్రం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా 9 ఇండ్లల్లో మంటలు వ్యాపించాయి.

ఈ ఘటనలో ఇండ్లన్నీ పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి అక్కడకి వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు.

నిరాశ్రయులైన 9 కుటుంబాలకు మానవతాదృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే తక్షణ సాయంగా రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page