గిఫ్ట్ ఏ స్మైల్‘లో భాగంగా 173 మంది

Spread the love
173 people as part of 'Gift a Smile'

గిఫ్ట్ ఏ స్మైల్‘లో భాగంగా 173 మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ట్యాబ్ లు అందజేసిన ఎమ్మెల్యే

సాక్షిత : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్‘ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన పుట్టిన రోజు సందర్భంగా బహదూర్ పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ MPC, BIPC చదువుతున్న 173 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన రోజున వృథా ఖర్చులకు బదులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మనసుకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. * పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని స్ఫూర్తిగా తీసుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్‘లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.*

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుల్లో రాణించి తల్లి దండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. క్రమశిక్షణతో నడుచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page