గడ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

Spread the love

డ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

అభివృద్ధికి రూ.2.37 కోట్లు, సంక్షేమానికి రూ.11.68 కోట్లు

మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి

సాక్షిత : జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడచిన మూడేళ్ళలో రూ.14,05,54,598లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. గడ్డమణుగు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు._

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం రూ.2,37,39,000లు మంజూరు చేశామన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం రూ.11,68,15,598లు ఖర్చు చేశామన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు 102 పక్కాగృహాలు మంజూరు చేశామన్నారు.

తాగునీటి వసతికి మరో రూ.68.60 లక్షలు

గడ్డమణుగులో జల జీవన్ మిషన్ కింద ఇంటింటికీ మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి రూ.46.80 లక్షలు మంజూరు చేశామన్నారు. ఇదే గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీకి మంచినీటి వసతి కోసం రూ.21.80 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page