దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం

Spread the love

దుండిగల్ గ్రామస్థులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం ఈ నెల 27న నిరుపేదలకు పంపిణి చేస్తాం :ఎమ్మెల్యే వివేకానంద.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 2వ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి గురువారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి ktr రానున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా బుధవారండబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి ఏర్పాట్ల పనులను సమీక్షించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద లబ్బి దారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.


స్థానిక నిరు పేదలకు 10శాతం ఇళ్ళు కేటాయింపు.
కుత్బుల్లాపూర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇతర ప్రాంతాల వారికీ కేటాయిస్తున్నారు, మరి ఇక్కడి పేదలు, స్థానికులు ఎటుపోవాలి అంటూ స్థానిక దుండిగల్ కౌన్సిలర్లు, నాయకులు ఎమ్మెల్యే ద్రుష్టి కి, ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్య ను తీసుకువెళ్ళటం తో స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద ఈ నెల 27వ తేదీన దుండిగల్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లో 10శాతం అంటే శుమారు 400ఇళ్లను దుండిగల్ స్థానిక నిరుపేదలను గుర్తించి వారికీ అందజేస్తామని ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని, ఇళ్ళు లేని నిరుపేదలను గుర్తించి ఎంక్వయిరీ చేసి వారికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

You cannot copy content of this page