మృతుడు రాజు కుటుంబానికి జడ్పిటిసి ,15000/ వేల రూపాయల ఆర్థిక సాయం

Spread the love
ZPTC, 15000/ thousand financial assistance to the family of the deceased Raju

మృతుడు రాజు కుటుంబానికి జడ్పిటిసి దశరథ్ నాయక్, సర్పంచ్ శ్వేతా భూనాధ్, ఉప సర్పంచ్ శారద పాండు కలిసి 15000/ వేల రూపాయల ఆర్థిక సాయం*


సాక్షిత : కడ్తాల్ మండలం పెద్దవేములోని బాయి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నవేములోని భాయి తండాకు చెందిన దేపావత్ రాజు అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి చిన్నవేములోని భాయి తండాకు చేరుకొని రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం రాజు మృతదేహానికి పూలమాలేసి నివాళులర్పించారు. తదుపరి రాజు కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000/రూపాయల ఆర్థిక సాయం అందించగా, స్థానిక సర్పంచ్ శ్వేతా భూనాధ్ 5000 రూపాయలు, గానుగమర్ల తండా ఉపసర్పంచ్ శారద పాండు 5000/ వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్ పత్తి పాండు సోమ్లా లక్ష్మణ్ దశరథ్ గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page