క్రీడలలో గెలుపు ఓటమి సహజం – జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

Spread the love

రాజీవ్‌గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న…

  • జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ..

-అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్..

గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య మరియు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ చేతులమీదుగా శాంతికపోతాలు ఎగురవేసి హాజరై ప్రారంభించారు…

అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా అనేది గ్రామాలకు అంకితం కాకుండా తాలూకా, జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో క్రీడ రంగంలో రాణించాలని అతిధులు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మరియు అలంపూర్ మాజీ సంపత్ కుమార్ క్రీడాకారులకు సూచించారు..గెలుపు ఓటమి సర్వసాధారణంగా భావించి క్రీడాకారులు ఆడాలన్నారు…తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేరేందుకు కృషి చేస్తామని తెలిపారు…

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి,టిపిసిసి రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకర్,ఓబిసి జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి, మధుసూదన్ బాబు,ఎంఎ.ఇసాక్,బండ్ల రాజశేఖరరెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,తుమ్మల నరసింహ,కౌన్సిలర్ కబీర్ దాస్ అనిత డిటిడిసి నరసింహ,ఎల్లప్ప,భాస్కర్ యాదవ్,యూసుఫ్, నాగేంద్ర యాదవ్,జోగ్గుల రవి,దినేష్, జహంగీర్, గౌస్, వెంకటస్వామి గౌడ్,TNR జగదీష్,మాల శ్రీనివాస్, అల్వాల రాజశేఖరరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, రేపల్లి కృష్ణ,కరాటే సత్యం,కౌసర్ బేగ్, కొత్త గణేష్, బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, జమల్,ఇలియాస్, రవి నాయుడు,మోహన్ యాదవ్, తదితరులు ఉన్నారు….

Related Posts

You cannot copy content of this page