విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జెడ్పీ చైర్మన్ కోరంకనకయ్య

Spread the love

డీసీసీబీ డైరెక్టర్ మల్లి బాబు.యాదవ్.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కామేపల్లి మండలం, బాసిత్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన .సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రారంబోస్థవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్. కోరం కనకయ్యగారు . మల్లిబాబు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన గ్రామ దేవతలైన ముత్యాలమ్మ,బొడ్రాయి లను దర్శించుకుని ముత్యాలమ్మ ఆలయం వద్ద గ్రిల్స్ ఏర్పాటు గురించి జెడ్పీ ఛైర్మెన్ గారితో గ్రామ పెద్దలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించి గ్రిల్స్ ఏర్పాటు భాధ్యత తనదేనని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారివెంట, స్థానిక సర్పంచ్ బాలు, ఎంపీపీ రాందాస్, మాజీ సర్పంచ్ అరెం రవి,నాయకులు ఫతే మహ్మద్, భద్రు, రాంమ్మూర్తి, నాగేశ్వరరావు, ఉపేందర్, వెంకన్న, సైదులు, కర్నాటి వెంకటేశ్వర్లు, కోరం సురేందర్, చందర్ సింగ్ రాథోడ్, బోడా మంగీలాల్ నాయక్, భూక్యా సర్దార్, రావూరి సతీష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page