వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు మంజూరు

Spread the love

YSR Grant of new pensions

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు మంజూరు
*లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష


సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు అందజేశారు.
27వ డివిజన్ పరిధిలోని కొత్త పింఛన్లు మంజూరు అయిన వాటిని మేయర్ శిరీష లబ్ధిదారులకి పింఛన్లు పంపిణీ చేశారు.
మేయర్ మాట్లాడుతూ వై.యస్.ఆర్. పింఛన్లు ఉదయం 5 గంటల నుండి గడప గడపకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.


వైయస్సార్ పింఛన్ కానుక జనవరి ఒకటి నుంచి పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు అందించేందుకు నగరపాలక ఏర్పాట్లు పూర్తి చేసింది. పింఛన్ కింద 2,750ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లే అందజేస్తున్నది.2022 జూలై నుంచి నవంబర్ మధ్య పింఛన్, రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలు ఎంపికైన వారికి ఒకటవ తేదీ ఆదివారం నుంచి అందించడం జరిగింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నగరపాలక పరిధిలో పెన్షన్ కానుక వారోత్సవాలు నిన్న ఘనంగా నిర్వహించామన్నారు.

ప్రతి నెల మొదటి రోజే, అది ఆదివారమైన, సెలవు దినమైన లబ్ధిదారుల గడప ముందుకొచ్చి ఠంచనుగా పింఛను అందిస్తున్నామని తెలియజేశారు. గతంలోలా చాంతాడంత క్యూలలో వృద్ధులు, దివ్యాంగులు నిలబడే అవస్థలు లేవని, ఆత్మ అభిమానులు చంపుకోవాల్సిన పనిలేదని తెలిపారు. ఒకవేళ పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని, వారి దగ్గర ఉండి చెయ్యి పట్టుకుని నడిపించి పెన్షన్ అందే విధంగా సాయం చేస్తారని లబ్ధిదారులకి వివరించారు.


అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో జూన్ 2020న, పాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు సీఎం నాంది పలికారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని ప్రారంభించారు. పింఛన్లు దరఖాస్తులు స్వీకరణ, మంజూరు అనేది నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుందని ఈ సందర్భంగా మేయర్ తెలియజేశారు.
నగరపాల సంస్థ పరిధిలో 19142 పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు.


27వ డివిజన్లో వృద్ధాప్యం పెన్షన్లు 126 మందికి, వితంతు పెన్షన్లు 90 మందికి, ఒంటరి మహిళ పెన్షన్లు ఏడు మందికి, వికలాంగుల పెన్షన్లు 21 మందికి, కిడ్నీ పేషంట్లకి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని. ఒక్క 27వ డివిజన్లోనే 245 మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష వారితో పాటు వై.యస్.ఆర్.సి.పి నాయకులు తులసి యాదవ్,
చింత రమేష్, గీత యాదవ్, డివిజన్ కార్యదర్శి గోపాల్, సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page