ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది: చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్

Spread the love

ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది: చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్

శంకర్‌పల్లి: నవంబర్ 15: (సాక్షిత ):
ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు బుధవారం శంకర్‌పల్లి మండల పరిధి ఎల్వర్తి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలో ఎవరు అభివృద్ధి
చెందారో ప్రజలే గమనించాలని భీం భరత్ విమర్శించారు. ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం పూటకు ఒక పార్టీ మారే వ్యక్తి అన్నారు. ఆయన వల్ల
చేవెళ్లకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య నియోజకవర్గానికి ఏమి చేశాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇస్తున్న ప్రతీ హామీ నెరవేరుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉదయ్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మనీష్ రెడ్డి, శ్రీకాంత్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్, ఎజాస్, శశికాంత్, మహేష్ రెడ్డి పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 15 At 7.53.05 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page