మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి

Spread the love


With Minister Errabelli Dayakar Rao

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని నేడు మంత్రుల నివాస ప్రాంగణంలోని ఆయన చాంబర్లో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులు కలిసి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్లు రవీందర్ రావు, రామారావు, ఈఎన్సీ సంజీవరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సంవత్సరం ప్రభుత్వానికి అత్యంత కీలకమైందని, పనులు సత్వరంగా, సమర్థంగా, నాణ్యంగా చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పనుల్లో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వేగంగా చేయాలన్నారు.

Related Posts

You cannot copy content of this page