SAKSHITHA NEWS

నవరత్నాలతో సంక్షేమ పాలన – స్పీకర్ తమ్మినేని

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలo గోకర్ణపల్లి పంచాయతి పరిధిలోని రంగనాథ్ పేట, మున్సిప్ పేట గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు నిర్దేశించిన వారికి అర్హత లేకపోయినా పెన్షన్ మంజూరు చేసే వారన్నారు నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని పార్టీలకతీతంగా అర్హత ప్రామాణికంగా పథకాలు పంపిణీ జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS