గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొంపుగూడెం రాజిరెడ్డి నియామకం.

Spread the love

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం గండిమైసమ్మ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వొంపుగూడెం రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి చేతుల మీదుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజిరెడ్డి కి నియామక పత్రం అందచేయడం జరిగింది.

ఈ సందర్భంగా రాజిరెడ్డి తన నియమకానికి కృషి చేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కర్రోల్ల సదానందం,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,దుండిగల్ PACS డైరెక్టర్ శ్రీనివాస్,129 డివిజన్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,సీనియర్ నాయకులు శివకుమార్ గౌడ్,జక్కుల మల్లేశ్,ఇబ్రహీం,అక్బర్ ఖాన్,ధర్మా రెడ్డి,దుబాయి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page