వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ ,హైదర్ నగర్ డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య

Spread the love

వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ ,హైదర్ నగర్ డివిజన్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా వినియోగించే ట్రాక్టర్ల ను కార్పొరేటర్లు శ్రీమతి రోజాదేవి రంగరావు , దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి లో వెలికి తీసిన వ్యర్థాలను, నాలలో వెలికితీసిన చెత్త ,చెదారం ను మరియు వ్యర్థాలను తరలించడానికి ఈ ట్రాక్టర్లు ఎంతగానో తోడ్పడుతాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ వాహనాల ద్వారా కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ వాహనాలను సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తరలిస్తూ కాలనీ లను స్వచ్ఛ కాలనీ లు గా తీర్చిదిద్దుతామని, ప్రజలకు ప్రశాంత వాతావరణం కలిపించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో DE ఆనంద్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు ,తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, ఇబ్రహీం, మోజేశ్, పద్మ, కవిత ,కుమారి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page