అభ్యర్థులు ఆన్‌లైన్‌ లోకూడా నామినేషన్‌ వేయొచ్చు: వికాస్‌ రాజ్‌

Spread the love

హైదరాబాద్‌:
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.

అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజే యాలన్నారు. హైదరాబాద్‌ లోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నామినేషన్‌ పత్రాలు, అఫి డవిట్‌ జాగ్రత్తగా నింపాలని సూచించారు. మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు ఇవ్వొ చ్చని, వాటితోపాటు 5 ఫొటోలు ఇవ్వాలని తెలిపారు.

అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలని, ప్రతి కాలమ్‌ నింపాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలి.

ఫొటోల విషయంలో అభ్య ర్థులు చాలా జాగ్రత్త వహిం చాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకొని ఫొటోలు దిగరా దు. కనీసం రెండు నెలల ముందు తీసుకున్న ఫొటోల ను మాత్రమే అందజేయాలి. అభ్యర్థుల ముఖాలు స్పష్టం గా ఉండేలా జాగ్రత్త పడాలి’’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page