జాతిపిత విగ్రహానికి పూలమాల వేసిన వెంకటేష్ గౌడ్

Spread the love

Venkatesh Goud garlanded the statue of the Father of the Nation

జాతిపిత విగ్రహానికి పూలమాల వేసిన వెంకటేష్ గౌడ్

అహింస అనే అయుధంతో సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ 74వ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మాగాంధీజీ ఒకరు. ఆయన మనకు అహింస, సత్యాగ్రహం అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసి, వాటిని వడటానికి కూడా ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు.

మహాత్మాగాంధీ ఆశయాలు, జీవన విధానం ప్రతి వ్యక్తికి ఆదర్శం అవ్వాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, ప్రధానకార్యదర్శి, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు,

రాములుగౌడ్, మౌలానా, ప్రదీప్ రెడ్డి, వాలి నాగేశ్వరరావు, పుట్టం దేవి, కరుణాకర్, నాగభూషణం, కూర్మయ్య, ఇంతియాజ్, రవీందర్, దనుంజయ్, వెంకటేష్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page