SAKSHITHA NEWS

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు

— ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి చిట్యాల రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ లో బయలుదేరిన వందే భారత్ రైలు చిట్యాల రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం
1:16ని లకి చేరుకుంది. ఈ సందర్భంగా అధికారులు ప్రజలు, విద్యార్థులు వందేమాతరం నినాదాలతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు రైల్వే శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు రైల్వే శాఖ తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శివరాంరెడ్డి, స్టేషన్ మాస్టర్ నవీన్ కుమార్, రైల్వే ఎడిఈ నాగేంద్ర, రైల్వే ఏ ఎస్ఐ వెంకన్న, స్థానిక కౌన్సిలర్ జమాన్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు పొట్లపల్లి నరసింహ,చికిలం మెట్ల అశోక్ అధికారులు నాయకులు ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
End


SAKSHITHA NEWS