ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి

Spread the love

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి

— ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా యువత శ్రమించాలి – ప్రవీణ్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల పట్టణ కేంద్రం లో బిఆర్ఎస్ పట్టణ యువజన సంఘం అ్యక్షుడు చిత్రగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో యువజన కార్యవర్గం సమావేశం ఎర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తుమ్మల నాగరాజు రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా పరిపాలన చేస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.
ఆ పథకాలను అన్నింటిని యువత ఉస్సహంగ పనిచేస్తూ అన్ని గ్రామాలలో ప్రభుత్వ పతకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని అలాగే ముందుకు సాగాలంటే ఎమ్మెల్యే చిరుమర్తి లిoగయ్య తోటే అది సాద్యం అవుతుందన్నారు. యువత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి సహకరిస్తూ తన బాటలో నడుస్తూ ఎమ్మెల్యే గెలుపు కోసం ఆహర్నిషలు శ్రమించి ఈసారి కూడా భారిమేజార్టితో గెలిపించికొని నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యుత్ ఉపాధ్యక్షులు జోగు శ్రీకాంత్, యూత్ నాయకులు ఎస్కే యాసిన్, గణేష్, వంశీ, రాజేష్, చింటు, నాని, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page