సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మరియు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసిన వాల్మీకి నాయకులు

Spread the love

సాక్షిత : *అలంపూర్ మాజీ శాసన సభ్యులు ,ఏఐసీసీ కార్యదర్శి డా ” సంపత్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో నడిగడ్డ వాల్మీకి నాయకులు వాల్మీకుల ఎస్ టి సాధన లో భాగంగా శాసన సభ సమావేశం వాల్మీకుల గురించి మరియు వారి స్థితి గతుల గురించి మరియు వాల్మీకి బోయలను ఎస్ టి లో చేర్చుటకు వారు అర్హులని శాసన సభలో మాట్లాడినందుకు భట్టి విక్రమార్క కి ధన్యావాదాలు తెలిపి కేంద్రం లో కూడా మీ సహాయ సహకారములు ఇవ్వాలని తెలిపారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో వాల్మీకుల ప్రస్తావన తీసుకువొచ్చినందుకు వాల్మీకి బోయలు కృతజ్ఞతలు తెలిపి  జరిగే పార్లమెంట్ లో కూడా మరొకసారి వాల్మీకి బోయల ప్రస్తావన తీసుకువచ్చి ఎస్ టి సాధన జరిగే విధంగా కృషి చెయ్యాలని అన్నారు .

సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రేపు కేంద్ర మంత్రులను కలవడం జరుగుతుంది అని అలాగే వాల్మీకి బోయల ఎస్ టి జాబితాకు కృషి చేస్తున్న సంపత్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వీరబాబు నేతృత్వంలో గద్వాల్ నుండి వాల్మీకి నాయకులు బల్గెర నారాయణ రెడ్డి మరియు నాగశంకర్ మరియు సద్దల రాములు ,ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ,రఘు నాయుడు.

అలంపూర్ నుండి ఎనుముల నాగరాజు ,మద్దిలేటి ,ఎల్కుర్ శ్రీనివాసులు ,పైపాడు శ్రీనివాసులు ,జగన్ నాయుడు తదితర వాల్మీకులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page