మరుపురాని మనిషి ‘ సూపర్‌స్టార్

Spread the love

Unforgettable Man ‘ Superstar

మనిషి ‘ సూపర్‌స్టార్ “

  • తెలుగు సినిమా గమనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన ఘనుడు
  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సాహాసానికి ఊపిరి… ధైర్యానికి పర్యాయ పదం… పట్టుదల, మానవత్వం, మంచితనం వీటన్నిటి కలబోత సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి మరుపురాని మనిషి మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధాకరం అని తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

తెలుగు సినిమా గమనాన్ని తనదైన ప్రత్యేక శైలితో పతాకస్థాయికి తీసుకువెళ్ళిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే చాలా అరుదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు సూపర్ స్టార్ అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

అలాంటి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, అసంఖ్యాకమైన కృష్ణ అభిమానులకు పొంగులేటి తన ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

చింతకానిలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

చింతకాని: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం చింతకాని మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బస్వాపురంలో జరిగిన అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు

. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామకృష్ణాపురంలో చట్టు రామారావు కుమార్తె నీతిక పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. అదేవిధంగా పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఆర్ధిక సాయాలను కూడా అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కన్నెబోయిన సీతారామయ్య, మండల రైతుబంధు కన్వీనర్ కిలారు మనోహర్, నారపోగు వెంకటేశ్వర్లు, కన్నెబోయిన కుటుంబరావు, శెట్టి మోహన్ రావు, గుడిపాటి నర్సింహారావు,

చంటి, పిన్నెల్లి శ్రీనివాస్, తమ్మారపు బ్రహ్మయ్య, షేక్ సిలార్ సాహెబ్, ఆర్.మోహన్ రావు, పెద్ద వెంకటరెడ్డి, ఎస్.నాగేశ్వరరావు, ఎస్ కై మదార్, కన్నెబోయిన విజయమ్మ, ఆలస్యం నాగయ్య, బొడ్డు వెంకటరామయ్య, జె. వెంకటేశ్వర్లు, జె. వీరబాబు, సతీష్, మందడపు శ్రీను, కొల్లి ఉపేందర్, కొల్లి వెంకయ్య, గడ్డం శ్రీను తదితరులు ఉన్నారు.

ఖమ్మం రూరల్ లో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

ఖమ్మంరూరల్: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఖమ్మంరూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా దానవాయిగూడెం, సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, బారుగూడెం తదితర గ్రామాలను సందర్శించారు.

దానవాయిగూడెంలో తిగుళ్ల జంగయ్య చనిపోయిందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. సాయిగణేష్ నగర్ లో కుందూరు వనజరెడ్డి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. సత్యనారాయణపురంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేడిద ఉపేంద్రమ్మను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బారుగూడెంలో గుద్దేటి పుల్లయ్య, ఎస్.కె.హసీనబేగం, ఎన్నెబోయిన వెంకటేశ్వర్లు కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను కూడా అందజేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు,

మండల నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మెండె వెంకటేశ్ యాదవ్, ఏనుగు వెంకటరెడ్డి, సురగాని ఉపేందర్, గునికంటి రమేష్, బట్టపోతుల సతీష్, బట్టపోతుల కిరణ్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page