రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ లో గత 10 సంవత్సర నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య

Spread the love

సాక్షిత : రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ లో గత 10 సంవత్సర నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ నిర్వహించిన బస్తి దర్శన్ కార్యక్రమంలో తెలియడంతో జలమండలి ద్వారా సుమారు 11.00 లక్షల రూపాయిల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ముంజురు చేయించి, స్థానిక కాలనీ సొసైటీ విభాగం,కాలనీ వాసుల ద్వారా కాలనీ లో పర్యటించి డ్రైనేజీ పైప్ లైన్ కొరకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్.

అలాగే కాలనీ లో పలు రోడ్ లలో డ్రైనేజీ సమస్య ఉంది తెలుపడంతో,జలమండలి మేనేజర్ జనార్దన్ మరియు వారి సిబ్బందితో కలిసి పర్యటించి వెంటనే ప్రతిపాదన పూర్తి చేసి మాకు అందచేస్తే త్వరలోనే ముంజూరు చేయిస్తా అని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.అలాగే త్వరలోనే అశోక్ నగర్లో సుమారు 50.00 లక్షల సీసీ రోడ్ పనులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తాం అని కార్పొరేటర్ తెలిపారు.వారితో కాలనీ అధ్యక్షులు శేష రెడ్డి,ఖలీమ్,చారి,నాగభూషణ్ చారి,శ్రీనివాస్,అమృత్ సాగర్,రవి తేజ,జ్యోతి,కాలనీ సొసైటీ మెంబెర్స్ తదితరులు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page