తెలంగాణ భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో

Spread the love

Under Telangana Land Conservation Samiti

సాక్షిత : తెలంగాణ భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మరియు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించడం జరిగింది.

దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల భూములైన భూదాన్, సీలింగ్ భూములను అక్రమంగా లాక్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నిర్వహించబోయే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ భూ రక్షణ సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొల్ల మల్ల నర్సింగ్ రావు, టిబిఆర్ఎస్ జాతీయ కార్యవర్గం సభ్యులు కమ్మెట రామస్వామి, టిబిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బుర్కి రాములు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కొదమ గుండ్ల అమృతయ, బాచుపల్లి మండల అధ్యక్షులు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page