మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

Spread the love

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామస్తులు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు మంత్రిని గ్రామానికి ఆహ్వానించారు. ఆంజనేయస్వామి దేవాలయం వద్ద సమావేశమైన గ్రామస్తులు తాము మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. గత పదేళ్లుగా ఎంతో అభివృద్ధి చేసిన మంత్రికి తాము అండగా నిలబడతామన్నారు.

ఎంతో అభిమానంతో గ్రామస్తులంతా ఒక్క మాట మీద ఉండి ఏకగ్రీవంగా తనకు మద్దతు తెలిపినందుకు మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా చూపిస్తున్న అభిమానంతో నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక జడ్పిటిసి విజయనిర్మల రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ సంఘం అధ్యక్షుడు రవీందర్, కే మాసయ్య, తిరుపతయ్య, వీ కృష్ణయ్య, కే శేఖర్, కనకం కృష్ణయ్య, మహేందర్, తిరుమలయ్య, రాములు, అంజీలమ్మ, బాలామని, రాములమ్మ, శేషమ్మ, చంద్రకళ, శివమ్మ, తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page