రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

Spread the love

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.
26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు M.తిప్పేస్వామి, సురేష్ బాబు, సతీష్ కుమార్, నరేష్, అశోక్,లింగమయ్య, కిషోర్, ఏకాంత్, చైతూ, నాగరాజు, మారుతి, శ్రీకాంత్ లు కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టిడిపి నీ వీడి వైసిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమామహేశ్వర నాయుడు నాయకత్వంలో కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధమని వారు తెలియజేశారు. గత వారం నుంచి కళ్యాణదుర్గం టిడిపిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిడిపి ఖాళీ అయిపోయి డీలా పడిపోయినట్లు తెలుస్తోంది…

Related Posts

You cannot copy content of this page