SAKSHITHA NEWS

TRS stands by every worker

ప్రతి కార్యకర్తకు అండగా టీఆర్ఎస్

తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిక

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
టిఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు అన్నారు. కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి సంబంధించిన 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కింది అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని, సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


SAKSHITHA NEWS