SAKSHITHA NEWS

TRIBUTE రాయల చంద్రశేఖర్ కు ఎంపీ రఘురాం రెడ్డి నివాళి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ హఠాన్మరణం చెందగా..ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరితో కలిసి నగరంలోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి..ఆయన సేవలను స్మరించుకున్నారు. రైతుల పక్షాన, పీడిత ప్రజల పక్షాన పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మానుకొండ రాధాకిశోర్, కొప్పుల చంద్రశేఖర్ రావు, దీపక్ చౌదరి, ఎండీ. ముస్తఫా, మిక్కిలినేని నరేందర్, కిషన్ రావు, పుసునూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

TRIBUTE

SAKSHITHA NEWS