SAKSHITHA NEWS

హైదరాబాద్:
మల్కాజ్‌గిరిలో దొంగలు రెచ్చిపోయారు. మల్కాజ్‌గిరి గౌతం‌నగర్‌లో దుర్గాభవాని ఆలయంలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు.

ఆలయం గోడకు కన్నం పెట్టి లోనికి దుండగులు ప్రవేశించారు. 20 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీ చేశారు. ఆలయంలో ఉన్న కౌంటర్ లోని రూ.80వేలు, హుండీలోని నగదు సైతం ఎత్తుకెళ్లారు. దొంగలు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ..


SAKSHITHA NEWS