టీచర్అర్హతకు టెట్‌

Spread the love

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2023 నిర్వహణకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది.

అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు పరీక్షకు హాజరుకావొచ్చు.


ఎగ్జామ్ ప్యాటర్న్: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1- నుంచి 5 తరగతులకు బోధించేందుకు పేపర్‌-1 రాయాలి. దానికి డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ విద్యార్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్‌-2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు ర్యాంకు నిర్ణయిస్తారు.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల కానున్నాయి. పూర్తి వివరాలకు www.tstet.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.

Related Posts

You cannot copy content of this page