స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలోని వాకింగ్ ట్రాక్.. విద్యుత్ దీప కాంతుల వెలుగులు

Spread the love

సాక్షిత : స్థానిక బాలుర జిల్లా పరిషత్ క్రీడా మైదానంలోని వాకింగ్ ట్రాక్.. విద్యుత్ దీప కాంతుల వెలుగులు సంతరించుకుంది. ఇటీవలనే వాకింగ్ ట్రాక్ చుట్టూ విద్యుత్ స్తంభాలు వేసి పెద్ద సైజు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైటింగు వ్యవస్థను స్థానిక శాసన సభ్యులు వల్లభనేని వంశీ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వాకింగ్ ట్రాకుకు, క్రీడా మైదానానికి రాత్రిపూట కొంత సమయం నడకకు, ఆటలకు ఈ విద్యుత్ లైట్లు ఎంతో ఉపకరిస్తాయని, ఇప్పటికే మైదానం చాలా అభివృద్ధి చెందిందని, దానితో పాటు లైటింగ్ ఏర్పరుచు కోవడం మైదానం ఇంకా సొబగులు దిద్దుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి, జెడ్పీ కో- ఆప్షన్ సభ్యులు ఎండీ గౌసాని, సర్పంచ్ నిడమర్తి సౌజన్య, హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని రవీంద్ర భవానీ, గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడుపల్లి బాలకృష్ణ మూర్తి, వాకర్స్ డిస్ట్రిక్ట్ కాబినెట్ జాయింట్ సెక్రటరీలు ముక్కామల సుబ్బారావు, కే.ఎన్. బాబూరావు, జిల్లా డిప్యూటీ గవర్నర్ వీసం ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు గొట్టం రవిబాబు, మున్వర్ అహమ్మద్, పియిటి ధనియాల నాగరాజు, సి. శ్రీనివాసరావు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page