రైతన్నలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం,

Spread the love

The Telangana government is the only government that supports the farmers,*

రైతన్నలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం,
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తున్న సీఎం కేసిఆర్,*

రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంఎంపీ పోతుగంటి రాములు

రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను సీఎం కొనుగోలు చేస్తున్నాడని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ పోతుగంటి రాములు అన్నారు.సోమవారం వంగూర్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ పోతుగంటి రాములు, పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి,లు ముఖ్యఅతిధులుగా హాజరై ప్రారంభించారు.

అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీటం వేస్తూ రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పులిజాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు గణేష్ రావు, వైస్ ఎంపీపీ సంధ్య నర్సింహారెడ్డి, కేటీఆర్ సేవ సమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్, సింగల్ విండో వైస్ చైర్మన్ బాలస్వామి, మండల రైతు సమితి అధ్యక్షులు నారాయణరావు, సర్పంచుల సంఘ అధ్యక్షులు అంకూరి అంజి, జిల్లా నాయకులు లాలూ యాదవ్, సింగల్ విండో డైరెక్టర్లు ఆనంద్ రెడ్డి,

మాధవరెడ్డి, ఎంపీడీవో పవన్ కుమార్, ఏవో తనూజ, సీఈఓ విష్ణుమూర్తి, సర్పంచ్ బక్కయ్య, నాయకులు సాయన్న , వెంకటేశ్వరరావు, రాజేందర్ రెడ్డి, సలేశ్వరం, ఎల్లా గౌడ్, రమేష్ గౌడ్, సైదులు, జానీ పాషా, చంద్రమౌళి, సాయి, నరసింహ, శీను, బాల్ నారి, నిజాముద్దీన్, లింగారెడ్డి, ముజాహిద్, డొక్కు వెంకటయ్య, అశోక్, గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page