మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

Spread the love

మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం…

కొంపల్లిలో మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినికేతన్ లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి నల్లాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతీ కాలనీ, బస్తీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటి వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, జీఎం శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ రవీందర్, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణు గోపాల్, ట్రెజరర్ రామమూర్తి, సెక్రెటరీలు.బి.సంతోష్, సంధ్య, వైస్ ప్రెసిడెంట్ జగ్నిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page