బాచుపల్లిలో రూ.42 కోట్లతో  ఎస్.ఎన్.డి.పి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

బాచుపల్లిలో రూ.42 కోట్లతో ఎస్.ఎన్.డి.పి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

SAKSHITHA NEWS

The MLA inspected the works of SNDP in Bachupally with a cost of Rs.42 crores

బాచుపల్లిలో రూ.42 కోట్లతో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బాచుపల్లి కౌసల్య కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కమిషనర్ వంశీకృష్ణ , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తో కలిసి పర్యటించారు.

ఈ మేరకు సుమారు రూ.42 కోట్లతో కేజిఎం ఎంక్లేవ్ నుండి కోకాకోలా కంపెనీ వరకు కౌసల్య కాలనీ మీదుగా జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అదే విధంగా ఇతర సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. తక్షణమే అక్కడే ఉన్న అధికారులకు పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

అదే విధంగా మిగిలిన లైబ్రరీ భవనం పనులు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎన్.డి.పి ఎస్ఈ ఆనంద్, ఈఈ నారాయణ, డిఈ నళిని, ఏఈ నాగరాజు మరియు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS