సీఎం సహాయనిధి 3లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ పరిధిలోని నల్లకుంట చెందిన లబ్దిదారులు మహమ్మద్ అసద్ S/o అక్బర్ ఎండి కి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద
3లక్ష రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అదేవిధంగా గద్వాల టౌన్ పరిధిలోని దౌదరపల్లీ చెందిన లబ్దిదారులు అసమ్మర్ పాషా S/o మహబూబ్ పాషా కి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద
14000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, కౌన్సిలర్ కృష్ణ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భగవంతు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు సుధాకర్, షుకర్, నాగులు యాదవ్ మోబిన్, సీతారాములు, వీరేష్ గద్వాల టౌన్ పార్టీ యూత్ అధ్యక్షుడు గంజి పేట మధు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page