SAKSHITHA NEWS

కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం మరియు స్మశాన వాటిక అభివృధికి సహకరించిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని సన్మానించిన కుత్బుల్లాపూర్ కురుమ సంఘం సభ్యులు. *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బీరప్ప నగర్ ఆవరణలో కుత్బుల్లాపూర్ కురుమ సంఘం కమిటీ హాల్ భవన నిర్మాణం మరియు స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతు శాలువాలతో ఘనంగా సన్మానించిన కురుమ సంఘం కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో పెద్ద కుర్మా యాదయ్య, సత్తయ్య, నగేష్, పెంటయ్య, నర్సింహా, జి శ్రీశైలం, అడ్వైసర్ పెంటయ్య, ప్రెసిడెంట్ నార్లకంటే రమేష్, జనరల్ సెక్రటరీ బాలరాజ్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రయ్య, జి మధు కుమార్, జి సాయి కుమార్, యూ వెంకటేష్, శ్రీశైలం, పల యాదగిరి, కుంటి మల్లేష్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS