ఎమ్మెల్యేను కలిసిన నూతన సంక్షేమ సంఘం

Spread the love

ఎమ్మెల్యేను కలిసిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రంగానగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులంతా కలిసిమెలిసి ఉంటూ కాలనీలో ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు వరప్రసాద్, జనరల్ సెక్రెటరీ జన్ను లక్ష్మణ రావు, ట్రెజరర్ నల్ల నర్సయ్య, కృష్ణమూర్తి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page