ముంచుకొస్తున్న ఏఐ ముప్పు.! వచ్చే ఐదేళ్లల్లో 30 కోట్ల జాబ్స్ మాయం.!

Spread the love

ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డట్టు తెలిపింది.

వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజీలు, టెక్స్ట్‌లు సృష్టించడంలో జెనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలు దూసుకెళుతున్న తరుణంలో… ఈ అసాధారణ టెక్నాలజీతో రోజూవారి పనులు సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, ప్రస్తుతం ఉన్న అనేకమంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారనున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page