ఘనంగా మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన….

Spread the love

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

132-జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ లోని మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మవార్ల ఆరాధన ప్రత్యేకమన్నారు. ఇంట్లో ఏ ఆపద వచ్చిన, శుభకార్యం చేపట్టిన ప్రజలంతా మొదట అమ్మవారినే కొలుస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుంటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి మన్య హరి, వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి, దేవాలయ కమిటీ చైర్మన్ నర్సింహులు, సభ్యులు మన్నె నరేష్, ఉపేందర్, రమేష్, రాములు, నాయకులు ముద్దాపురం ప్రభాకర్ గౌడ్, సుధాకర్, కృష్ణ గౌడ్, జ్ఞానేశ్వర్, అరుణారెడ్డి, సమ్మయ్య నేత, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page